త్రీవిక్ర‌మ్ బ‌న్నీ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న‌

త్రీవిక్ర‌మ్ బ‌న్నీ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న‌

0
41

డైరెక్ట‌ర్ వంశీ స్టైలిస్ట్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన చిత్రం నాపేరు సూర్య నా ఇళ్లు ఇండియా . ఈ సినిమా ఆసించిన స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోకపోవ‌డంతో బ‌న్నీ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌నే ఉద్దేశంతో ఉన్నారు బ‌న్నీ. అందుకే డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ తో త‌న త‌రువాత సినిమా తీయాల‌ని నిర్ణ‌యంచుకున్నాడ‌ట.

ఈ క్ర‌మంలో బ‌న్నీకి మంచి మంచి క‌థ‌లు వ‌చ్చినా కూడా వాటిని ప‌క్క‌న పెట్టి త్రివిక్ర‌మ్ కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలో త్రివిక్ర‌మ్ ట్రాక్ లో ప‌డిన బ‌న్నీకోసం మంచి క‌థ‌ను త‌యారు చేసేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ట‌. ఇక రేపు త్రివిక్ర‌మ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌న్నీ సినిమా గురించి ఒక ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఫిలిమ్ న‌గ‌ర్ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.