ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఇంట్లో చోరీ

ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఇంట్లో చోరీ

0
24

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కోడెల ఇంటికి చేరుకున్నారు. విద్యుత్ మరమ్మతు పనులు చేయాలంటూ లోపలికి ప్రవేశించారు.

అనంతరం ఇంట్లోంచి కంప్యూటర్లు పట్టుకుని పరారయ్యారు.
గేటు వద్ద ఉన్న వాచ్ మాన్ వారిని ఆపేందుకు ప్రయత్నించగా అతన్ని తోసేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

కోడెల శివ ప్రసాద్ కు కూడా సమాచారం ఇచ్చినట్లు ఈ నివాసం వద్దనున్న సిబ్బంది తెలిపారు. అసెంబ్లీకి సంబందించిన ఫర్నిచర్ గుంటూరు, సత్తెనపల్లిలో కోడెల కార్యాలయాల్లో ఉంది. దీనిని ఇవాళ అసెంబ్లీ సిబ్బంది స్వాధీన చేసుకునేందుకు వెళ్లనున్నారు.