టీడీపీ ప్లానా మజాకా

టీడీపీ ప్లానా మజాకా

0
33

తెలుగుదేశం పార్టీ బీజేపీ తరపున ఒకరికి మంత్రి పదవి ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ప్రధాని మోదీ ఇటీవలే వందరోజుల పాలన సక్సెస్ ఫుల్ గా చేసుకున్నారు…

ఇక రానున్న రోజుల్లో పట్టులేని రాష్ట్రాల్లో పట్టు సాధించుకోవాలనే ఉద్దేశంతో మంత్రి వర్గ విస్తరణ చేయాలని చూస్తున్నారట… మంత్రి పదవి కోసం బీజేపీ నాయకులు పోటీ పడటం సహజం. కానీ విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ అధిష్టానం కూడా తన అనుచరులకు దక్కించేకు పోటీ పడుతోందట…

ఇప్పటికే తెలంగాణలో కిషన్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు ఇప్పు నెక్స్ట్ ఏపీలో ఒకరికి మంత్రి పదవి వరిస్తుందని వార్తలు వస్తున్నాయి.. బీజేపీ తరపున కన్నా, జీవీఎల్ వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి వరిస్తుందని అనుకుంటున్నారు… కానీ టీడీపీ అధిష్టానం సురేష్ ప్రభుకు ఇప్పించాలని చూస్తున్నారట… సురేష్ ప్రభు టీడీపీ మద్దతు దారుడు అందుకే ఆయనకు మంత్రి వరించాలనే ప్రయత్నాలు చేస్తోంది.