వైసీపీ విజయ సాయిరెడ్డిపై 100 కోట్ల పరువు నష్టం

వైసీపీ విజయ సాయిరెడ్డిపై 100 కోట్ల పరువు నష్టం

0
39

టీవీ9 వ్యవస్థాపక ఛైర్మన్, సీఈవో రవిప్రకాష్ పై అసందర్భమైన, అసత్య ఆరోపణలు చేసిన పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి పై 100 కోట్ల పరువునష్టం దావా వెయ్యాలని రవిప్రకాష్ కార్యాలయం నిర్ణయించింది. రవి ప్రకాష్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటంలోని పూర్తి వివరాలు ఇవి…

ఏబీసీఎల్‌ సంస్థలో చట్టవ్యతిరేకంగా ప్రవేశించిన రామేశ్వరరావు, మెఘా కృష్ణా రెడ్డి ద్వయం ఈ నీచమయిన ఆరోపణలు చేయిస్తోంది. నెలక్రితం ఇవే అసత్య ఆరోపణలు రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి అనుచరుడైన రౌడీ షీటర్ రామారావు లిఖితపూర్వకంగా వివిధ శాఖలకు పంపించారు. ఈ ఆరోపణలు కేవలం గాలి కబుర్లేనని అధికారులు నిర్ధారించారు. రామారావు నెలక్రితం పంపిన లేఖ కాపీనే ఎంపి విజయ సాయి రెడ్డి ఇప్పుడు తన లెటర్ హెడ్ పై పంపించారు.

గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై మలేషియా, సింగపూర్ విదేశీ నిధులు తరలింపంటూ అబద్ధపు ఫిర్యాదులు పంపి అభాసుపాలయిన రామారావు తిరిగి నేడు రవిప్రకాష్ పై ఆధారాలు లేని ఆరోపణలు సంధించారు. ఈ కట్టుకథలు వెనుక ఈ పెద్దలే ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోంది.
కంపెనీ షేర్ల వివాదం లో పై చేయి సాధించడం కోసం మై హోమ్ రామేశ్వర రావు, మెఘా కృష్ణారెడ్డి ఈ నీచమైన ఆరోపణలను వివిధ శాఖలకు పంపిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.

ఈ నిరాధారమైన ఆరోపణలను అత్యుత్సాహంతో ప్రసారం చేసిన ఛానెళ్ల పై కూడా చర్య తీసుకోవాలని తమ కార్యాలయం నిర్ణయించిందని తెలిపారు.