లోకేశ్ ట్వీట్ పై వైసీపీలో తీవ్ర చర్చ

లోకేశ్ ట్వీట్ పై వైసీపీలో తీవ్ర చర్చ

0
23

ఏదైనా ఊరిని దుష్టశక్తి ఆవహించినప్పుడు చెట్లు మాడిపోవడం, ప్రజలు ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కథల్లో వింటుంటాం…. అయితే అమరావతి విషయంలో కూడా అదే జరిగిందని టీడీపీ మాజీ లోకేశ్ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ళ క్రితం రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు.. అయితే ఇప్పుడక్కడ చూస్తే ఎడారిని తలపిస్తోందని అన్నారు లోకేశ్.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీ పార్టీ డమ్మీలకు కూడా రాజధాని గురించి మీ వైఖరి ఏమిటో తెలీక రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఇంతకీ అమరావతి నిర్మాణానికి మీ దగ్గర ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా? లేక రాజధానిని ఇంకెక్కడికైనా తరలిస్తున్నారా అని ప్రశ్నించారు.

జగన్ మోహన్ రెడ్డి తనకోసం రాజధాని ప్రాంతంలో రాజభవనం కట్టుకున్నారు. మరి రాష్ట్రానికి రాజధాని నగరం అక్కర్లేదా? రాజధానిపై మీ వైఖరి ఏంటో మీ నోటితో చెప్పండని డిమాండ్ చేశారు లోకేశ్. ఇక ఆయన చేసిన ట్వీట్ పై వైసీపీ తీవ్ర చర్చ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.