జగన్ తన కోరికను ఇలా నెరవేర్చుకుంటున్నారు

జగన్ తన కోరికను ఇలా నెరవేర్చుకుంటున్నారు

0
22

స్మశానాలకు, మరుగుదొడ్లకు మీ పార్టీ రంగులు పూసుకునే కార్యక్రమం పూర్తయ్యింది కదా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని లోకేశ్ ప్రశ్నించారు… అయితే ఇక ఆలస్యం ఎందుకు పోలీస్ స్టేషన్లకు కూడా వైసీపీ రంగులు వెయ్యడం ప్రారంభించండిని ఎద్దేవా చేశారు…

శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులతో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమకేసులు పెట్టిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని లోకేశ్ ప్రశ్నించారు…. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై ఏకంగా పోలీసులతోనే దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాజాగా తిరుచానూరులో టీడీపీ కార్యకర్త హేమంత్ పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు…

జనస్ మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ కోరికలను పోలీసుల ద్వారా తీర్చుకుందామనే సరికొత్త పంధా ఎంచుకున్నారని లోకేశ్ మండిపడ్డారు…. ఇకపై ఉపేక్షించేది లేదు అక్రమ కేసులు పెడుతున్న అధికారుల పై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కించే న్యాయ పోరాటం ప్రారంభించబోతున్నామని లోకేశ్ హెచ్చరించారు..