గంటా శ్రీనివాసరావు మనసంతా ఆపార్టీ పైనే

గంటా శ్రీనివాసరావు మనసంతా ఆపార్టీ పైనే

0
27

పార్టీ ఏదైనా సరే విజయం తప్పనిసరిగా సాధిస్తారు మాజీ టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు… ఆయన రాజకీయ అడుగు అలాంటిది మరి… సుమారు రెండు దాశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు గంటా…

ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలు మారినప్పటికీ గెలుపు మాత్రం నల్లేరు మీద నడకే… అంతటినేత ఇప్పుడు తాను ఉన్న పార్టీ అధికారం కోల్పోవడంతో సైలెంట్ అయ్యారు…. ఈ నేపథ్యంలో ఆయనను బీజేపీ రాజ్యసభ సభ్యుడు కలిశారట…

పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… కానీ వారి ఆఫర్ ను గంటా తిరస్కరించారట…ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు మనసంతా వైసీపీపైనే ఉందట వైసీపీలోకి వెళ్లాలని గత కొద్దికాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట… ఈమేరకు పార్టీ పెద్దలతో మంతనాలుకూడా జరిపారట.

’’’’’’’’’’’