జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

0
27

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆపార్టీలో నేతల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది… దీంతో పార్టీలో ఉండేవారు ఎవరో వెళ్లేవారు ఎవ్వరో ఇప్పుడే చెప్పాలేమని అంటున్నారు టీడీపీ నేతలు…

ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో మరో టీడీపీ సీనియర్ నేత బీద మస్తాన్ రావు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు… కాగా ఇటీవలే ఆయన టీడీపీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే…

తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపించారు… ఈలేఖలో బీద మస్తాన్ రావు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు పేర్కోన్నారు…