సంక్రాంతి పండుగకు ప్రతీ ఒక్కరు తప్పక చేయాల్సిన పనులు.. డోంట్ మిస్

సంక్రాంతి పండుగకు ప్రతీ ఒక్కరు తప్పక చేయాల్సిన పనులు.. డోంట్ మిస్

0
54

సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలు దరించడం ఇంట్లో గారెలు బూరెలు చేసుకోవడం అలాగే ఇంటిముందు ముగ్గు వేయడం వంటి వాటి సర్వసాధారణం…. ప్రతీ సంవత్సరం జనవరిలో వచ్చే ఈ పండుగకు ఇవి కామన్…

ఇక ఉభయగోదావరిజిల్లాల్లో అయితే కొళ్ల పందాలు ఆడుతారు… అయితే వీటితో పాటు సంక్రాంతి పండుగరోజు ప్రతీ ఒక్కరు కొన్ని పనులు కచ్చితంగా చేయాలని పెద్దుల అంటుంటారు… వాటిని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

సంక్రాంతి రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు.
మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్య్ర బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి.
సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. అందుచేత సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి, పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి.

తెల్లవారు జాముననే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపుదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగుతుంటారు. వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు.
అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

ఆ రోజున తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని , పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం.
మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టడం మన ఆనవాయితి..