పాత మిత్రులే కానీ సరికొత్త ఆలోచనలు

పాత మిత్రులే కానీ సరికొత్త ఆలోచనలు

0
34

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పాత మిత్రులు కొత్త మిత్రులుగా తయారుఅవుతున్నారు… ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ జనసేన పార్టీలు కీలక భేటీ కానున్నాయి…

ఈ సమావేశంలో పొత్తులపై ఒక అవగాహణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు… బీజేపీ తరపున కన్నా జీవీఎల్ సునిల్ దేవేందర్లు అలాగే జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదేంద్ల మనోహర్ లు హాజరు కానున్నారు వీరిమధ్య జరిగే చర్చల్లో పొత్తులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పోరాటం అంశం కూడా ఈ మావేశంలో చర్చించే అవకాల ఉన్నాయని తెలుస్తోంది…

ఇప్పటికే హస్తిన వేదిక మంతనాలు జరిపిన పవన్ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రంగం సిద్ది చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి,.. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాకముందే కొత్త స్నేహాలకు ఏర్పాటుకు బీజాలు పడ్డాయని మరికొందరు చర్చించుకుంటున్నారు….