చంద్రబాబు బిగ్ షాక్…. వైసీపీకి ఒకే సారి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

చంద్రబాబు బిగ్ షాక్.... వైసీపీకి ఒకే సారి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

0
31

త్వరలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు మరికొందరు ఎమ్మెల్సీలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చెరేందుకు సిద్దంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు అలాగే మరికొందరు ఎమ్మెల్సీలు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే వారిని తామేమి చేసుకోవాలని అన్నారు… త్వరలో తమ పార్టీసభ్యులతో నిండిపోయే శాసనమండలిని రద్దు చేయడం వల్ల తమకే నష్టం అని సజ్జల అన్నారు…

అయినా కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు… మండలి రద్దుపై మేథావులు సహాలు సూచనలు తీసుకుంటున్నామని అన్నారు.. ఈ రోజు మండలి రద్దు చేయాలా లేదా అనేదానిపై క్లారిటీ వస్తుందని అన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి…