21 రోజులు లాక్ డౌన్ మోదీ మరో కీలక ప్రకటన ?తర్వాత ఏమిటి

21 రోజులు లాక్ డౌన్ మోదీ మరో కీలక ప్రకటన ?తర్వాత ఏమిటి

0
49

కోవిడ్ 19 ఇప్పుడు దేశం అంతా విస్తరించింది, ఈ సమయంలో రోడ్లపైకి రాకుండా ఉండటమే ఉత్తమం అని చెబుతున్నారు పోలీసులు.. అయితే తాజాగా సీఎంకేసీఆర్ కూడా ఇదే విషయాలని చెప్పారు.. కర్ఫూ వాతావరణం ఉంటుందని అన్నారు.

ఇక కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా కీలక ప్రకటన చేశారు. మహమ్మారి కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు, మొత్తం 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు.

ఈ 21 రోజులు ఎవరూ బయటకు రావద్దు అని తెలిపారు, అసలు ఏ అవసరం ఉన్నా బయటకు రాకండి అని చెప్పారు, ఇలా కట్టడి చేయకపోతే ఈ కోవిడ్ మరింత విస్తరిస్తుంది అని తెలిపారు, ఇది మన ప్రాణాల కంటే ఎక్కువ కాదు అని అన్నారు, నేను ప్రధానిగా చెప్పడం లేదు ఇంట్లో వ్యక్తిగా చెబుతున్నా అన్నారు.
ఇక అప్పటికీ దీని తీవ్రత తగ్గకపోతే మరో కీలక నిర్ణయం తీసుకుంటారు అని చెబుతున్నారు అధికారులు.

,