బిహర్ లోని కొందరు యువకులు నాలుగు నెలల క్రితం బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేశారు, ఈ సమయంలో మంచి సేల్ వచ్చేది… 100 కే చికెన్ బిర్యానీ రావడంతో చాలా మంది కొనేవారు, కాని లాక్ డౌన్ తో అమ్మకాలు పోయాయి, ఈ సమయంలో హోమ్ డెలవరీ చేస్తాము అని నేరుగా సోషల్ మీడియాలో వారి నెంబర్ వారం రోజులు పోస్ట్ చేశారు.
పోలీసులు మళ్లీ చూస్తే అరెస్ట్ చేస్తారు అని వాటిని డిలీట్ చేశారు, ఈ సమయంలో దాదాపు వారికి 200 మంది కస్టమర్ల నుంచి ఆర్డర్ వచ్చింది.. వారికి బిర్యానీ తీసుకువెళ్లేవారు, ఈ సమయంలో పోలీసులు వారిని ఆపినా పేదలకు సాయం చేస్తున్నాం అని బిర్యానీ పొట్లాలు చూపించేవారు.
ఈ సమయంలో అక్కడ రెడ్ జోన్ లోకి రావడంతో, అక్కడ పోలీసు ఉన్నతాధికారికి అనుమానం వచ్చింది.. వారి ఫోన్ చెక్ చేస్తే వాట్సాప్ లో లొకేషన్లు ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయి, దీంతో ఈ కరోనా సమయంలో ఇలాంటి పని చేస్తున్నారా అని వారిపై కేసులు నమోదు చేశారు.