అక్కడకు వెళితే ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మర్చిపోకండి

అక్కడకు వెళితే ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మర్చిపోకండి

0
39

ఈ లాక్ డౌన్ వేళ అన్నీ షాపులు దుకాణాలు తెరచుకున్నాయి, ఈ సమయంలో చాలా వరకూ రోడ్లపైకి జనం వస్తున్నారు, అయితే ఇప్పుడు స్పాలు బ్యూటి పార్లర్లు, సెలూన్స్ తెరిచారు, అయితే తమిళనాడులో కేసులు ఎక్కువ ఉన్నాయి, అందుకే సెలూన్స్ కు వచ్చే వారి రక్షణ కోసం అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక పై అక్కడ సెలూన్స్ లో రిజిస్టర్ ఉంటుంది, అక్కడకు వెళ్లిన వారుక్రాఫ్ కటింగ్ షేవింగ్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ రాయాలి, అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి, ఇలా చేయడానికి ప్రధాన కారణం ఉంది, ఒకవేళ కటింగ్ చేసిన వ్యక్తికి సెలూన లో వారికి ఎవరికి అయినా వైరస్ ఉంటే, ఈ సమయంలో ఎవరు కటింగ్ చేయించుకున్నారో వారికి కాల్ చేసి వారిని జాగ్రత్తపడాలి అని చెప్పవచ్చు, అందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది.

అందుకే ఇలా సెలూన్స్ లో వీటిని మెయింటైన్ చేయాలని చెప్పింది ప్రభుత్వం, ఇక ఎవరి టవల్ వారు తెచ్చుకోవాలి, చేతికి శానిటైజర్ రాసుకోవాలి. ఇది ఏపీ తెలంగాణో కూడా అమలు చేస్తే బాగుంటుంది అంటున్నారు జనం.