భార్యను సజీవంగా పూడ్చి పెట్టిన భర్త…. ఎక్కడో తెలుసా…

భార్యను సజీవంగా పూడ్చి పెట్టిన భర్త.... ఎక్కడో తెలుసా...

0
28

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది… మద్యం మత్తులో కట్టుకున్న భర్తే భార్యను కొట్టి సజీవంగా పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది… రెండు రోజుల తర్వాత మృతిరాలి ఏడు సంవత్సరాల పాప గ్రామస్తులకు చెప్పడంతో హత్య విషయం బయటపడింది…

గ్రామంలో నివాసం ఉంటున్న పొన్నూరు సుభాషిని ఆమె భర్త సోములు కలిసి మద్యం సేవించారు… ఆతర్వాత గొడవ పడ్డారు… ఈ గొడవలో సొములు కర్రతో సుభాషినిని బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి పడిపోయింది… అయితే సుభాషినిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా పక్కనే చెట్లపొదల్లో గుంత తీసి సజీవంగా పూడ్చిపెట్టాడు…

కుమార్తెను బెధిరించి పారిపోయాడు… మృతురాలుకుమార్తె రెండు రోజుల తర్వాత బందువులకు గ్రామస్తులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది… పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు…