ఇప్పటి వరకు మన దేశంలో కరోనా మరణాలు లేని రాష్ట్రాలు ఇవే..

ఇప్పటి వరకు మన దేశంలో కరోనా మరణాలు లేని రాష్ట్రాలు ఇవే..

0
37

మన దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే… ఈ మాయదారి మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా డ్రాగన్ మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఈ మధ్య కాలంలో మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి…

రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు… అంతేకాదు కరోనా కేసులతో పాటు నిత్యం అనేక మంది చనిపోతున్నారు… దేశంలో నిన్న కరోనాతో 384 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు… ఇటీవలే ప్రతీ రాష్ట్రంలోనూ ఒకటో రెండో కరోనా మరణాలు నమోదు అవుతున్నాయి…

అయితే మన దేశంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు… మణిపూర్,మిజోరాం, నాగాలాండ్, సిక్కి రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటలో తెలిపింది…