బ్రేకింగ్… వైసీపీ మంత్రి అనుచరుడిని కత్తితో పొడిచి చంపిన వైనం….

బ్రేకింగ్... వైసీపీ మంత్రి అనుచరుడిని కత్తితో పొడిచి చంపిన వైనం....

0
35

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది… అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పెర్నినాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావును తాజాగా దారుణంగా హత్య చేశారు… ఆయన మార్కెట్ లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి పారిపోయాడు…

దీంతో ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భాస్కరరావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు… ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిరు… ఆయన మృతి చెందారని వైసీపీ నేతలకు తెలియగానే పెద్ద ఎత్తుకు ఆసుపత్రికి చేరుకుంటున్నారు…

దీంతో పోలీసులు ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు నిర్దారిస్తున్నారు… కాగా ప్రస్తుతం భాస్కరరావు మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నారు…