నెలసరి సమయంలో అమ్మాయిలు ఐదు రోజులు ఈ ఫుడ్ తీసుకోవద్దు

నెలసరి సమయంలో అమ్మాయిలు ఐదు రోజులు ఈ ఫుడ్ తీసుకోవద్దు

0
35

ప్రతీ అమ్మాయికి రుతుస్రావం అనేది కామన్ గా జరుగుతుంది, అయితే అన్నీ రకాల ఆహారపదార్దాలు తినకూడదు అని చెబుతున్నారు వైద్యులు, టీనేజ్ అమ్మాయిలు రుతుస్రావం సమయంలో ఆందోళన చెందవద్దు అని చెబుతున్నారు,నెలసరి సమయంలో కొబ్బరి, బెల్లం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నెయ్యికి బదులు వెన్న వాడాలి. శాకాహారులైతే.. ఆకుకూరలు, కాయగూరలతో పాటు నట్స్, ఖర్జూరం తీసుకోవాలి. ఇక అటుకులు తీసుకుంటే మంచిది, పాలు తాగాలి అంతేకాని కాఫీ టీలు తాగద్దు అంటున్నారు నిపుణులు, ఇక చికెన్ మటన్ తిన్నా లిమిట్ గా తినాలి, ఈ సమయంలో చేపలు తినడం మంచిదే.

విటమిన్-సి ఉన్న ఆహరం తీసుకోవాలి తాజా పండ్లు… జామ, నిమ్మ, నారింజ ఈ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది, ఈ సమయంలో చపాతిలు పరోటాలకు దూరంగా ఉండాలి, పిజ్జాలు బర్గర్లు ఈ ఐదు రోజులు తినద్దు.

లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, అలాగే వాటర్ ఐదు లీటర్లు రోజూ తీసుకోవడం మంచిది. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లను, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి. కానీ బేకరీ ఐటమ్స్ చిప్స్ కేకులు వద్దు, అలాగే డ్రింకులు ఐస్ క్రీమ్స్ తీసుకోకూడదు, కూలింగ్ వాటర్ కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలి.