రెండు బీర్లు, కోటర్ తాగిన తల్లి… పసికందు మృతి…

రెండు బీర్లు, కోటర్ తాగిన తల్లి... పసికందు మృతి...

0
49

అమెరికాలో దారుణం జరిగింది.. తల్లి ఫుల్ గా మద్యం సేవించడంతో అభం సుభం తెలియని పసికందు మృతి చెందింది.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మేరీ ల్యాండ్ కు చెందిన మురియెల్ అనే మహిళ వర్చు వల్ పార్టీలో 2 బీర్లు అలాగే కొంచె మద్యం సేవించింది…

ఆతర్వాత ఇంటికి వచ్చి మద్యం మత్తులో తన కూతురుకు పాలు పట్టి మరో కూతురు దగ్గర పడుకుంది.. ఆతర్వాత డోర్లన్ని క్లోజ్ చేసి పడుకున్నారు.. ఉదయం లేచి చూసే సరికి పసికందు పెదాలు నీలం కలర్ లోకి మారిపోయి కదలకుండా ఉంది… దీంతో తల్లి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది..

అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి పసికందు మృతి చెందినట్లు తెలిపారు.. మద్యం సేవించి అక్కడే పడుకోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు దీంతో ఆమెపై పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు.. అయితే చిన్నారి మృతికి తల్లే కారణమని ఎలాంటి ఆదారాలులేవు దీంతో న్యాయస్ధానం కేసు కొట్టేసింది…