ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య దేశంలో సంచ‌ల‌నం

ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య దేశంలో సంచ‌ల‌నం

0
30

ఈ కుటుంబానికి ఏ క‌ష్టం వ‌చ్చిందో , ఏ ఆప‌ద వ‌చ్చిందో ఏకంగా పెద్ద కుటుంబం, ఇంటిలో ఉన్న 12 మంది ఒకేసారి మూకుమ్మ‌డిగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు, విషాదం ఏమిటి అంటే ఇందులో 11 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.

ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని దేచు పోలీసు స్టేషన్‌ పరిధిలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. స్ధానికులు ఇక్క‌డ ఇంటి నుంచి పురుగుల మందు వాస‌న భారీగా రావ‌డం గ‌మ‌నించారు.. లోప‌ల‌కి వెళ్లకుండా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

అందులో చెక్ చేసిన పోలీసులు అందులో నిర్జీవంగా ప‌డిపోయిన 12 మందిని గుర్తించారు, అందులో 11 మంది చ‌నిపోయారు. ఒక‌రు ప్రాణాల‌తో ఉంటే వెంట‌నే ఆ ఒక్క‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు, అత‌నికి కూడా సీరియ‌స్ గా ఉంది కండిష‌న్ ..పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన ఈ కుటుంబం కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌కు వచ్చింది అని తెలుస్తోంది, అస‌లు ఏమైంది కార‌ణం ఏమిటి అనేది వారి కుటుంబ సభ్యు‌లు ద్వా‌రా తెలుసుకుంటున్నారు పోలీసులు.