వైసీపీ నాయకుల కళ్ళు నెత్తికెక్కాయంటూ రెచ్చిపోయిన లోకేశ్…

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దౌర్జన్యకాండ కొనసాగుతోందని ఆరోపించారు టీడీపీ నేత నారాలోకేశ్… వైసీపీ గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా మండిగిరిలో వైసీపీ నేత కల్లుబోతు సురేష్ గ్రామ సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ, భౌతికదాడి చేసారని మండిపడ్డారు లోకేశ్… చెప్పిన పని చెయ్యలేదని ప్రభుత్వ ఉద్యోగి చెంప పగలకొట్టడానికి ఎంత దైర్యం అని ప్రశ్నించారు…

- Advertisement -

అధికార మదంతో వైసీపీ నాయకుల కళ్ళు నెత్తికెక్కాయని మండిపడ్డారు. ఏఓ పై దాడి చేసిన వైసీపీ నేత ని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు… ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు…

మరో ట్వీట్ చేస్తూ….దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతుంది’ అంటారు. అలాంటి తరగతి గదులను విజ్ఞానం అందించడంతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్పే పవిత్రమైన ఆలయాలుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ గురుపూజా దినోత్సవ శుభాకాంక్ష్లలని తెలిపారు…

తమ ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా ప్రపంచదేశాలకు భారతదేశ సంస్కృతి, నాగరికతల గొప్పదనాన్ని చాటిచెప్పిన ఫిలాసఫర్, ఉపాధ్యాయుడు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అని అన్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...