బంగారం ధరకుమళ్లీ రెక్కలు వచ్చాయి..గడిచిన 11 రోజులుగా డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరిగింది… ఇక్కడ మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది.. మళ్లీ రెండు రోజులుగా ఇండియాలో పసిడి ధర పెరుగుతోంది. మరి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.810 పెరిగింది. దీంతో రూ.50,070 చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 పెరుగుదలతో రూ.45,900కు చేరింది.
బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం తగ్గింది.. రూ.400 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.67,300కు తగ్గింది.
వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం తగ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల తగ్గుదలతో బంగారం ధర పెరుగుతోంది. జనవరి వరకూ బంగారం ధరలు ఇలాగే ఉండనున్నాయి.