కరోనా సోకిన కొడుకుకు వెంటిలేటర్ కోసం హైదరాబాద్ వ్యాపారి 50 లక్షలు ఆఫర్ – చివరకు

కరోనా సోకిన కొడుకుకు వెంటిలేటర్ కోసం హైదరాబాద్ వ్యాపారి 50 లక్షలు ఆఫర్ - చివరకు

0
27
Image credit: Tempura/Getty Images

కరోనా పరిస్దితులు దారుణంగా ఉన్నాయి.. ఎక్కడ చూసినా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక ధనవంతుడు పేదవాడు అనే తేడా లేదు ఎక్కడ చూసినా ఇదే పరిస్దితి కనిపిస్తోంది.

నా కుమారుడికి కరోనా సోకింది. వెంటిలేటర్ అత్యవసరం. లేకుంటే వాడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దయచేసే ఏ కార్పొరేట్ ఆస్పత్రి అయినా వెంటిలేటర్ ఏర్పాటు చేయండి 50 లక్షలు ఇస్తాను అని ఓ బడావ్యాపారి కోరాడు.

 

 

అంతేకాదు దానికి బిల్లు కూడా వద్దు ఈ నగదు ఎక్కువ అని అనుకుంటే కోవిడ్ సోకిన వారికి ఆ నగదు ఖర్చు చేయండి అని చెప్పాడు, బయట పరిస్దితులు అలా ఉన్నాయి.. ఇక్కడ వ్యాపారి ఇంత ఆఫర్ ఇచ్చినా, ఆ వ్యాపారి కుమారుడికి దాదాపు 24 గంటల తరువాత మాత్రమే వెంటిలేటర్ లభించింది.

 

 

హైదరాబాద్ లో ప్రాణాలు నిలిపే వెంటిలేటర్ లకు అంత డిమాండ్ ఉంది, మరి పేదల పరిస్దితి ఏమిటి అందుకే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి.. మాస్క్ ధరించాలి శానిటైజర్ రాసుకోవాలి అని తెలియచేస్తున్నారు అధికారులు.