ఈ కరోనా వైరస్ నీటి ద్వారా సోకుతుందా ? నిపుణులు ఏమంటున్నారు

ఈ కరోనా వైరస్ నీటి ద్వారా సోకుతుందా ? నిపుణులు ఏమంటున్నారు

0
29

ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండాలి అంటే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే ఎంతో ప్రమాదం.. అయితే ఈ కరోనా వైరస్ నీటి ద్వారా సోకుతుందా లేదా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి… మరి దీనిపై ఓ క్లారిటీ అయితే ఇస్తున్నారు నిపుణులు.

 

నీటి ద్వారా కరోనా సోకుతుందా అంటే ? సోకదు అని అధికారులు సైంటిస్టులు చెబుతున్నారు..నీటిలో కరోనా నీరు గారిపోతుంది. అందుకే నీటి ద్వారా కరోనా రాదు అని తెలిపారు, ఉత్తరప్రదేశ్లో కరోనాతో చనిపోయిన కొంత మంది మృతదేహాలను యమునా నదిలో పడేస్తున్నారు. ఆ నీటి ద్వారా కరోనా సోకుతుందేమోనని అక్కడి ప్రజలు టెన్షన్ పడ్డారు. అయితే ఇలా కరోనా సోకదు అంటున్నారు నిపుణులు.

 

తుంపర్లలో ఉండే కరోనా గాలి ఎటు వీస్తే అటు కొంత దూరం వెళ్తుంది. చీకటి గోడలు, తలుపులు మూసి ఉండే ఇళ్ల లోపల కరోనా ఎక్కువగా ఉంటుంది. నీటి ద్వారా కరోనా రాదు అంటున్నారు.వైరస్ సోకిన వ్యక్తికి మీటర్ 3.28 అడుగులు లోపు ఉన్నవారికి ఇది సోకే ప్రమాదం ఉందని WHO చెప్పింది. ముక్కుద్వారా వేగంగా ఇది శరీరంలోకి ఎంటర్ అవుతుంది, నోరు ముక్కు కండ్లు ద్వారా వెళుతుంది. ఇక కరోనా సోకిన వారు ఏదైనా ముట్టుకుంటే దానిని మనం ముట్టుకుని ఆ చేతులు ముక్కు నోరు దగ్గర పెట్టుకుంటే కరోన సోకే ప్రమాదం ఉంది.

 

నీటిద్వారా కరోనా రాదు అంటున్నారు నిపుణులు.