అయోధ్య రామ మందిర నిర్మాణంలో హైదరాబాద్ కూడా పాలుపంచుకుంది.

సికింద్రాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లిలో అయోధ్య రామ మందిరం తలుపులు తయారవుతున్నాయి.

రామమందిరానికి టేకు తలుపులను అనురాధ టింబర్స్ వారు తయారు చేస్తున్నారు.

వీటి కోసం 60 మంది నిపుణులైన కళాకారులు పగలు రాత్రి పని చేస్తున్నారు.

ఇప్పటికే అందమైన శిల్పాలతో కూడిన 18 తలుపులు చెక్కారు.

ఇంకా 100 తలుపులు తయారు చేస్తున్నామని కంపెనీ యజమాని శరత్ బాబు తెలిపారు.