అవసరాలను బట్టి జగన్ మాట మార్చేశారు

అవసరాలను బట్టి జగన్ మాట మార్చేశారు

0
22

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవసరాలను బట్టి మాట మార్చుతున్నారు…. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ రైతుకు వైఎస్సార్ రైతు భరోసా కింద 12500 రూపాయలు ఇస్తామని చెప్పారు

చెప్పిన మాట ప్రకారం జగన్ ఈ పథకాన్ని అమలు చేశారు… అయితే ఇచ్చిన మాట ప్రకారం 12500 రూపాయలు కాకుండా అందుకు మరో వెయ్యి రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రతీ ఏట రైతుకు 13500 చొప్పున ఐదు సంవత్సరాలకు 67500 రూపాయలు పెట్టుబడి కింద సాహాయం అందుతోంది..

ఇప్పటికే ఏపీ లోటు బడ్జెట్ లో ఉంది ఇలాంటి సమయంలో జగన్ ఇలాంటి సాహసం చేస్తుంటే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది… రానున్నరోజుల్లో జగన్ ద్వారా ఇంకెన్ని సంచలన హామీలు చూడాల్సి వస్తుందోనని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.