దూకుడు పెంచిన జనసేనాని… వైసీపీలో వణుకు

దూకుడు పెంచిన జనసేనాని... వైసీపీలో వణుకు

0
30

జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల పొత్తును చూసి ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వణుకు పుడుతోందా అంటే అవుననే అంటున్నారు మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదేండ్ల మనోహన్ తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు…

ఈ సమావేశంలో నాదేండ్ల మనోహన్ మాట్లాడుతూ…స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపిస్తామని అన్నారు… బీజేపీ జనసేన కలయిక రాష్ట్రానికి లాభం అని అన్నారు… అందుకే వైసీపీ నాయకులు వణుకు అని ఎద్దేవా చేశారు.. అలాగే మూడు రాజధానులపై కూడా స్పందించారు…

గతంలో మోడీ అమరావతిలో రాజధాని శంకుస్థాపన చేశారని అక్కడే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు… కాగా జనసేన బీజేపీతో పెట్టుకున్ననాటినుంచి తన దూకుడును పెంచింది… రానున్న నాలుగు వారాలపాటు పవన్ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.. స్ధానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకున్నారు…