జ‌గ‌న్ కు గుడ్ న్యూస్ మ‌రో రాష్ట్రంలో దిశ చ‌ట్టం

జ‌గ‌న్ కు గుడ్ న్యూస్ మ‌రో రాష్ట్రంలో దిశ చ‌ట్టం

0
33

ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహన్ రెడ్డి ముందు చూపుతో తీసుకువ‌చ్చిన చ‌ట్టాలు ఇప్పుడు మ‌న దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్ర‌వేశ‌పెట్టాల‌ని భావిస్తున్నాయి, అందులో దిశ చట్టం కూడా ఒక‌టి, ఇప్ప‌టికే దిశ పోలీస్ స్టేష‌న్లు యాప్స్ ప్ర‌వేశ‌పెట్టి మ‌హిళ‌ల‌కు పూర్తి భ‌ద్ర‌త ఏపీలో ఉంది అని నిరూపిస్తున్నారు సీఎం జ‌గ‌న్.

అత్యాచార కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడేలా చేయడంతో పాటు 21 రోజుల్లోనే తీర్పు వెలువడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది రూపొందించింది దిశ చ‌ట్టం. తాజాగా దీనిపై అధ్య‌యనం చేయాలి అని
మహారాష్ట్ర సర్కారు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

ఇది నిజంగా గొప్ప విష‌యంగానే చెప్పాలి, అంతేకాదు వారికి నెల రోజుల స‌మ‌యం ఇచ్చింది.. మార్చి 30 న నివేదిక ఇవ్వాలి అని చెప్పారు. అక్క‌డ మంత్రి దీనిపై క్లారిటీ ఇచ్చారు, ఇప్ప‌టికే దీనిపై ఢిల్లీ ఒడిశా ప్ర‌భుత్వాలు కూడా బాగున్నాయి అని ఆస‌క్తి వ‌హించిన విష‌యం తెలిసిందే.