ఏపీ సర్కార్ పై లోకేశ్ ఫైర్

ఏపీ సర్కార్ పై లోకేశ్ ఫైర్

0
36
Lokesh

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాయం అవుతుందని నారా లోకేశ్ ఆరోపించారు… 70 మంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్న తరువాత కూడా ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇసుక దాహం తగ్గలేదని ఎద్దేవా చేశారు… వైసీపీ స్యాండ్ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతుందని ఆరోపించారు…

ఇసుక దొరక్కుండా చేసి అడ్డదారిలో రేట్లు పెంచి అమ్ముకుంటూ ప్రజలను కొల్లగొడుతున్నారు…స్వయంగా వైసీపీ శాసనసభ్యుడే బొచ్చెడు ఇసుక కూడా గ్రామాల్లో ఇవ్వలేకపోతున్నాం అని గోడు వెళ్లగక్కారు అంటే వైసీపీ స్యాండ్ మాఫియా అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుందని అన్నారు లోకేశ్