హీరోయిన్ పూర్ణకు వేధింపులు నిందితుల ప్లాన్ ఏమిటంటే?

హీరోయిన్ పూర్ణకు వేధింపులు నిందితుల ప్లాన్ ఏమిటంటే?

0
30

కొందరు కేటుగాళ్లు సెలబ్రెటీలను టార్గెట్ చేస్తారు, వారిని మోసం చేయాలి అని భావిస్తారు. లేకపోతే వారికి వల వేసి మోసాలు చేస్తారు…హీరోయిన్ పూర్ణ తెలుసుగా అవును సినిమా హీరోయిన్ ..మలయాళంలో తన తొలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కేరళ కుట్టీ పూర్ణ..

శ్రీ మహాలక్ష్మీ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇక మరో పక్క పలు షోలు కూడా చేస్తోంది ఆమె..
అయితే హీరోయిన్ పూర్ణని నలుగురు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఆమెని వేధిస్తున్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నలుగురు నిందితుల్ని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు శరత్, రమేష్, అస్రఫ్, రఫీజ్ గా పోలీసులు గుర్తించారు.. డబ్బు కోసం వీరంతా.. ఒకరికి ఒకరు సంబంధంలేనట్లుగా వేరువేరు నంబర్ల ద్వారా పూర్ణకు ఫోన్ చేసి వేధించారు. చివరకు పోలీసులు కూపీ లాగితే వీరు అంతా ఒకే బ్యాచ్ అని తెలుసుకున్నారు, వీరిని అరెస్ట్ చేశారు పోలీసులు, అంతా నగదు కోసం చేశారట.