అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

0
39

భార్యపై పెంచుకున్న అనుమానంతో ఆమెను ఫొలంలో గొంతుకోసి చంపాడు భర్త… ఈ దారుణం చిత్తూరు జిల్లా వీ. కోట మండలంలో జరిగింది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ముగానిపల్లెకు చెందిన ప్రభాకర్ రెడ్డి గొర్రెల కాపరి అతడికి ఎనిమిదేళ్ల క్రితం కర్నాటకకు చెందిన అరుణతో వివాహం జరిగింది…

వీరి సంతానానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో అనుమానం వీరి కాపురాన్ని అల్లకళ్లోలం సృష్టించింది… భార్యపై అనుమానంతో భర్త గొడవపెట్టుకునేవాడు… ఇదే విషయమై అనేకసార్లు పంచాయితీ జరిగింది.. కానీ పరిస్థితి సర్దుమనగలేదు ఈ క్రమంలో భార్యభర్తలు గొర్రెలకు గడ్డీ తీసుకువచ్చేందుకు ఫొలానికి వెళ్లారు..

అక్కడ మరోసారి భార్యతో గొడవ పెట్టుకున్నాడు… క్షిణికావేశంతో భార్య గొంతు కోసి హత్య చేశాడు ప్రభాకర్ రెడ్డి ఆతర్వాత అతనుకూడా కొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు… కొనఊపిరితో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించారు… భార్య అక్కడికక్కడే మృతి చెందింది… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..