మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న మంత్రినాని

మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న మంత్రినాని

0
47

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని కంటతడి పెట్టుకున్నారు…
డిక్లరేషన్ పై చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తాజా పరిణామాలపై ఆయన భావోద్వేగానికి గురి అయ్యాడు…

రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని సోమూ వీర్రాజు చేపట్టిన తర్వాతే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు… సీఎం జగన్ కులమాతాలకు సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు… డిక్లరేషన తొలగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు…

ముందు ప్రధాని మోడీని సతీ సమేతంగా ఆలయానికి వెళ్లమని చెప్పారు నాని… తనను ఎవరు టచ్ చేయలేదరని హెచ్చరించారు… కాగా ఈ రోజు సాయంత్రం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు… అలాగే చంద్రబాబు నాయుడుపై కూడా నాని ఫైర్ అయ్యారు… చంద్రబాబు నాయుడు వెంకన్నను కూడా రాజకీయానికి వాడుకుంటున్నారని ఆరోపించారు…