రాధేశ్యామ్ తర్వాత క్లారిటీ వచ్చేసింది…

-

ప్రస్తుతం బాహుబలి స్టార్ హీరో ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం చేస్తున్నారు ఈ సినిమా తర్వాత ఆదిపురుష్ చిత్రం ప్రకటించారు, ఈ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ తో చిత్రం చేయనున్నారు, అయితే తాజాగా మరో చిత్రం ప్రకటన వచ్చేసింది అంటే ఆయన చేస్తున్న సినిమా కాకుండా ఇంకో మూడు సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. వచ్చే మూడు సంవత్సరాలు ప్రభాస్ డేట్స్ ఖాళీ లేవు అనే చెప్పాలి.

- Advertisement -

కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఆయన సినిమా ఉంటుంది అని ఇప్పటి వరకూ వార్తలు విన్నాం అయితే తాజాగా ఇదే నిజం అయింది, ప్రభాస్ తో ఆయన సినిమా ఒకే అయింది, ప్రకటన వచ్చేసింది.
హోంబలే ఫిలింస్ ప్రభాస్ తో ఈ సినిమా నిర్మిస్తోంది. సలార్ అనే చిత్ర టైటిల్ కూడా ప్రకటన చేసింది యూనిట్.

ఇక ప్రభాస్ లుక్ రఫ్ గా ఉంది, ఇక్కడ చాలా డిఫరెంట్ గా ప్రభాస్ కనిపిస్తున్నారు, ఇక ఇందులో ఫుల్ గా మాస్ యాక్షన్ అనేది కనిపిస్తోంది, సో గన్ ను నిటారుగా నిలబెట్టిన ప్రభాస్ ఫోటో అభిమానులకి బాగా నచ్చింది.

ఇక నిర్మాత మాట్లాడారు, వచ్చే ఏడాది ఈ సినిమా స్టార్ట్ చేస్తాం అన్నారు, అయితే రాధేశ్యామ్ చిత్రం తర్వాత ఇది స్టార్ట్ చేస్తారు అని తెలుస్తోంది, ఇక భారతీయ భాషలు అన్నీంటిలోని ఈ చిత్రం తీస్తున్నారు.
హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ ప్రకటనతో ఒక్కసారిగా దేశంలో అందరూ ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు కేజీఎఫ్ 2 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు అనేది తెలిసిందే వారి బ్యానర్ లో ఇది మూడో అతి పెద్ద సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...