ఈ చేపలు సెనైడ్ కంటే డేంజర్ తింటే ఇక ప్రాణాలు ఉండవు

ఈ చేపలు సెనైడ్ కంటే డేంజర్ తింటే ఇక ప్రాణాలు ఉండవు

0
35

చేపలు చాలా మంది ఇష్టంగా తింటారు.. అయితే ఇప్పుడు చెప్పే ఈ చేపలు సెనైడ్ కంటే విషపూరితమైనవి… వెంటనే చనిపోతారు.. వినడానికే చాలా భయంగా ఉంది కదా..దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సముద్రపు ఒడ్డుకు ఆ చేపలు కొట్టుకువచ్చాయి.. ఈ చేపలు చనిపోయి ఉన్నాయి ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి.

 

బ్రిటన్ శాస్త్రవేత్త డాక్టర్ టెస్ గ్రిడ్లీకి ఆ చేపలు కనిపించాయి..అవి అత్యంత విషపూరితమైన రాక్షసి కళ్ల పఫర్ ఫిష్అ ని గుర్తించారు.

ఇవి సెనైడ్ కన్నా డేంజర్, ఫాల్స్ బేలో కుప్పలుతెప్పలుగా ఇవి ఉన్నాయి, ఇక అధికారులు ఆ ప్రాంతం సీజ్ చేశారు,

ఇవి ముట్టుకోవద్దు అని అలాగే తినవద్దు అని ప్రచారం చేశారు.

 

ఇక్కడ మరో విషాదం ఏమిటి అంటే, ఈ చేపలు తిని ఓ కుక్క చనిపోయిందని ఆఫ్రి ఓషన్స్ కన్జర్వేషన్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇక్కడ దాదాపు రెండు వేల చేపలు చనిపోయాయి ఎందుకు చనిపోయాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.