YS Jagan | అమ్మను ముందుంచి షర్మిల అక్రమాలకు పాల్పడుతోంది -జగన్

-

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) తన చెల్లి షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. తన పంతం నెగ్గించుకోవడానికి షర్మిల తమ తల్లి విజయమ్మని అడ్డుపెట్టుకొని అక్రమ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన సోదరి వైఎస్ షర్మిల(YS Sharmila) తన తల్లి పేరు మీద సరస్వతి పవర్ షేర్లను బదిలీ చేయడంలో దురాశ చూపారని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) కి తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం, షర్మిల తల్లి విజయమ్మను(YS Vijayamma) ముందు వరుసలో ఉంచుతూ షేర్ల బదిలీలను పొందారని జగన్ పేర్కొన్నారు.

- Advertisement -

తన సోదరి వైఎస్ షర్మిల తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే తమ తల్లి వైఎస్ విజయమ్మను తెరపైకి తెచ్చారని జగన్ NCLT కి తెలిపారు. సరస్వతి పవర్ షేర్ల వివాదంలో చిక్కుకున్నందుకు తన తల్లి పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు. తనకు తన తల్లి పట్ల గౌరవం ఉందని, కానీ తన సోదరి చేసిన చట్టవిరుద్ధమైన చర్యలను ఎదుర్కోవడానికే తాను ఈ పిటిషన్ దాఖలు చేశానని జగన్ తెలియజేశారు.

కాగా.. జగన్, ఆయన భార్య భారతి రెడ్డి(YS Bharathi Reddy), క్లాసిక్ రియాల్టీలు కలిసి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాదారుల పేర్లను సవరించడం ద్వారా NCLT తమ వాటాలను పునరుద్ధరించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విజయమ్మ, సరస్వతి పవర్ డైరెక్టర్ చాగరి జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లకు, సరస్వతి పవర్ షేర్‌హోల్డర్ల జాబితా నుండి జగన్ పేరును తొలగించాలని షర్మిల చేసిన విజ్ఞప్తికి సమాధానమిస్తూ జగన్ ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. షర్మిల అక్రమ, మోసపూరిత కార్యకలాపాల కారణంగా ఆమెపై ఉన్న ప్రేమను కోల్పోయానని జగన్ NCLT కి తెలిపారు. షర్మిల తన ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. షర్మిల, ఆమె టీమ్ పాత తేదీలతో నకిలీ అఫిడవిట్‌లను సృష్టించి, ట్రిబ్యునల్‌ ను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారని జగన్(YS Jagan) పేర్కొన్నారు. NCLT తదుపరి విచారణను ఏప్రిల్ 3కి షెడ్యూల్ చేసింది.

Read Also: నిమ్మలని అసెంబ్లీ రావొద్దన్న నారా లోకేష్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...