Pranay Murder Case | ప్రణయ్-అమృత కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ఈకేసులో ఏ2గా ఉన్న సుభాష్ కుమార్కు మరణశిక్ష విధించడంతో పాటు మిగిలిన ఆరుగురికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పుపై ఈ కేసును హ్యాండిల్ చేసిన పోలీస్ కమిషనర్ ప్రస్తుతం హైడ్రా కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రంగనాథ్(Ranganath) స్పందించారు. ఈ తీర్పు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ‘‘ఈ కేసులో తీర్పు రావడం ఆలస్యం అయినా.. న్యాయం జరిగింది. కోర్టులో బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఈ తీర్పు నిదర్శనం. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సాక్షులకు అభినందనలు’’ అని తెలిపారు.
Pranay Murder Case | ప్రణయ్ కేసు తీర్పు ఎంతో ఆదర్శవంతం: రంగనాథ్
-