2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరగనుంది. మార్చి 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చలు జరుగుతాయి. 27తో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.