వైసీపీ నేత వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 1 వరకు రిమాండ్లో ఉండనున్న వంశీని నాంపల్లి కోర్టు నుంచి విజయవాడకు తరలించారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని ఆమె కుమారులని చెప్పుకుని ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారు. భూమిని కొనడానికి సదరు మహిళతో తాను ఒప్పందం కుదుర్చుకున్నానంటూ శ్రీధర్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో వల్లభనేని వంశీని(Vallabhaneni Vamsi ) ఏ2గా, రాము, రంగా అనే మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు పోలీసులు. గన్నవరం కోర్టులో(Gannavaram Court) ఆత్కూరు పోలీసులు ఇటీవల పీటీ వారెంట్ దాఖలు చేయడంతో వంశీని.. విజయవాడ నుంచి గన్నవరం తీసుకెళ్లారు పోలీసులు.