నల్గొండ జిల్లా హాజీపూర్ లో జరిగిన దారుణం మరువలేనిది ..నరరూప రాక్షసుడిగా వరుస హత్యలు చేశాడు సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి. ఈ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్ రెడ్డికి ఫోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.
దీనిపై బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. మృతుల్లో ఒకరైన శ్రావణి తల్లి ఈ అంశంలో పోలీసులకు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అతనికి ఉరిశిక్ష వెంటనే వారంలోపు విధించాలని చెబుతున్నారు, లేకపోతే తప్పించుకునేందుకు అవకాశాలు వెతుక్కుంటాడు అని అంటున్నారు.
శ్రీనివాస్ రెడ్డి చనిపోయిన తర్వాత అతడి శవాన్ని తమకు చూపించాలని, అప్పుడే తమకు మనశ్శాంతి అని ఆ కుటుంబాలు అంటున్నాయి, కల్పన తల్లి దీనిపై స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే తాము పది నెలలుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు.ఈ దుర్మార్గుడు కల్పన , శ్రావణి, మనీషాలపై అత్యంత దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడి చంపేసిన విషయం తెలిసిందే…దేశంలో ఇది సంచలనం అయింది పూర్తి సాక్ష్యాలు పోలీసులు కోర్టుకు ఇవ్వడంతో అతనికి ఉరిశిక్ష పడింది.