ఏపీ సీఎంతో రాఘువీరా రెడ్డి భేటీ….

ఏపీ సీఎంతో రాఘువీరా రెడ్డి భేటీ....

0
71

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ చీఫ్ రఘువీరా రెడ్డి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు… రఘువీరా రెడ్డి జగన్ ను కలవనున్నారనే వార్త తెలియడంతో ప్రతీ ఒక్కరు ఆయన కూడా వైసీపీలో చేరుతారని చర్చించుకుంటున్నారు…

కాంగ్రెస్ నేతలు సైతం ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు.. కానీ అసలు నిజం అదికాదట త్వరలో రఘువీరా రెడ్డి కుమర్తె వివాహం జరుగనుంది ఈ వివాహానికి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు రేపు రఘువీరా రెడ్డి కలవనున్నారు…

ఇటీవలే చిరంజీవీని కూడా కలిశారు రఘువీరా… దీంతో అనేక వార్తలు వచ్చాయి.. ఈవార్తలపై క్లారిటీ ఇచ్చారు మడకసిర మండలంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రారంభించనున్నామని ఈ వేడుకకు చిరును ఆహ్వానించామని తెలిపారు…