మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్ బీ ఐ, అయితే ఖాతాదారులు ఎక్కువ మంది ఉన్న బ్యాంకు కూడా ఎస్ బీ ఐ అనే చెప్పాలి, అయితే అనేక పథకాలు కొత్త స్కీమ్ లు కూడా తీసుకువస్తుంది ఎస్ బీ ఐ, అలాగే పలు లోన్ల విషయంలో కూడా తక్కువ రేటుకి ఇంట్రస్ట్ లు ఉంటాయి, అందుకే ఖాతాదారులు ఈ సర్వీసులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు.
ఇక ఈ డిజిటల్ యుగంలో అనేక సర్వీసులు జస్ట్ ఒక్క క్లిక్ తో వచ్చేస్తున్నాయి.బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్ళాల్సిన అవసరం ఇక లేదు. ఫోన్ చేస్తే చాలు… నగదు నేరుగా ఇంటికే వచ్చేస్తుంది. అది తాజాగా ఎస్ బీఐ చేస్తోంది.
ఇప్పుడు మరో కొత్త సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.బ్యాంక్ డోర్స్టె్ప్ ఎస్బీఐ ఏటీఎం సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే దీనికి కారణం కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఈ సేవలు లక్నోలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటి దగ్గరకు డబ్బులు వచ్చేస్తాయి. ఇక సీనియర్ సిటిజన్స్ కు ఇది చాలా బెస్ట్, అయితే ఇక్కడ సక్సెస్ అయితే మిగిలిన చోట్ల కూడా ఇది అమలు చేయాలి అని చూస్తున్నారు.