కరోనాతో టీడీపీ కీలక నేత మృతి

కరోనాతో టీడీపీ కీలక నేత మృతి

0
97

కరోనా వైరస్ ఎవ్వరిని వదలకుంది… ముఖ్యంగా ఈ మాయదారి మహమ్మారి సినీ ప్రముఖులను రాజకీయ నాయకులను వదలకుంది.. ఇప్పటికే చాలా మంది నటులు రాజకీయ నేతలు కరోనా వైరస్ ను జయించిన సంగతి తెలిసిందే… ఇక మరికొందరు కరోనాతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు..

తాజాగా కరోనా వైరస్ బారీన పడి ప్రధాన ప్రతిపక్షటీడీపీ నేత తుది స్వాస విడిచారు… ఏపీ కాపు కార్సోరేషన్ మాజీ చైర్మన్ చలమశెట్టి రామానుజయ కరోనా తో మృతి చెందారు… కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది… దీంతో ఆయన విజయవాడలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు…

తాజాగా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.. ఈరోజు ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన మ‌ృతి చెందారు… చలమశెట్టి మృతి పట్ల చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు… ఆయన మరణం పార్టీకి తీరనిలోటు అని తెలిపారు… కాగా చలమ శెట్టి రామానుజయ కృష్ణా జిల్లా వాసి…