స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారికి కేంద్రం గుడ్ న్యూస్ అకౌంట్లో పదివేలు – ఇలా అప్లై చేయాలి

-

మన దేశంలో లక్షలాది మంది స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారు ఉన్నారు, ఇప్పటికి ఈ ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది… అయితే ఆన్ లైన్ ఫుడ్ యాప్స్ లో రెస్టారెంట్ల నుంచి ఫుడ్ వస్తుంది కాని ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ నుంచి ఎలాంటి ఫుడ్ మనం ఆర్డర్ ఇవ్వలేము, అయితే కేంద్రం ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

త్వరలోనే ఇంటి దగ్గరకే ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ను రుచి చూసే అవకాశం రానుంది.. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీతో కేంద్ర ప్రభుత్వం చేతులు కలుపుతోంది. మన దేశంలో ప్రముఖ నగరాలు చెన్నై హస్తిన, వారణాసిన ఇండోర్ , అహ్మదాబాద్ లో స్ట్రీట్ వెండర్స్ 250 మందితో ఓ పైలెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తోంది.

వీరిని ఆన్ లైన్ యాప్ కు కనెక్ట్ చేస్తుంది, వీరి వ్యాపారం పెంచడమే కాదు స్విగ్గీతో డెలివరీ ఇవ్వచ్చు,
వారికి పాన్ కార్డు, రిజిస్ట్రేషన్, యాప్స్ వాడకం, మెనూ డిజిటలైజేషన్, ధరలు, ప్యాకేజింగ్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేయనుంది. పీఎంఎస్వీ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ కింద వీధి వ్యాపారాలకు రూ. 10 వేలు వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇస్తోంది నేరుగా అకౌంట్లో జమ చేస్తుంది. సో ఇక ఇక్కడ సక్సెస్ అయితే దేశం అంతా అమలు చేయనున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన చేయనుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...