పార్లేజీ కంపెనీ కీలక నిర్ణయం శభాష్ అంటున్న ప్రజలు

-

బిస్కెట్ల పేరు చెబితే మంచి క్వాలిటీ బిస్కెట్లుగా పార్లేజీ కంపెనీ గుర్తు వస్తుంది, అంతేకాదు యాడ్స్ విషయంలో కూడా ఈ కంపెనీ వినూత్నంగా ఆలోచిస్తుంది, అంతేకాదు పలు ఆఫర్లు ఇస్తుంది, తక్కువ రేటుకు బెస్ట్ క్వాలిటి బిస్కెట్లు పార్లేజీ అందిస్తుంది, ఈ లాక్ డౌన్ సమయంలో చాలా వరకూ పార్లే అమ్మకాలు పెరిగాయి, అందరూ కూడా ఈ బిస్కెట్లను భారీగా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే

- Advertisement -

గత ఎనిమిది దశాబ్ధాల్లో ఎప్పుడూ లేనంతగా లాక్డౌన్ అమలైన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో పార్టేజీ బిస్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ కంపెనీ అంటే అంత ట్రస్ట్ జనాలకి, అయితే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది కంపెనీ..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నకిలీ టీఆర్పీ రేటింగుల వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే.

మెరుగైన టీఆర్పీ రేటింగ్స్ కోసం అక్రమాలకు పాల్పడుతున్న పలు న్యూస్ ఛానళ్లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, దీనిపై విచారణ జరుగుతోంది, ఈ సమయంలో అలాంటి ఫేక్ న్యూస్ ఛానళ్లకు ఇకపై తమ కంపెనీ
వాణిజ్య ప్రకటనలు ఇవ్వడాన్ని నిలిపివేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.ఇక తాము వారికి యాడ్స్ ఇవ్వము అని తెలిపింది దీంతో నెటిజన్లు మంచి నిర్ణయం అని అంటున్నారు.

ఇటువంటి విషపూరితమైన సమాచారాన్ని పంపే వార్తా ఛానెళ్లకు తాము వాణిజ్య ప్రకటనల రూపంలో డబ్బును ఎందుకు ఇవ్వాలనే అభిప్రాయంతో పార్లే సంస్థ భావిస్తుంది. అంతేకాదు ఇటీవల బజాజ్ కూడా ఇలాంటి డెసిషన్ తీసుకుంది, ఇప్పుడు పార్లే తీసుకుంది, ఇక ఇలా పలు కంపెనీలు ఆలోచించాలి అంటున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

చిరు స్టెప్పుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గుర్తింపు..

Megastar Chiranjeevi.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు....