కుంకుడుకాయలతో నిజంగా చుండ్రు సమస్యని తగ్గించుకోవచ్చు, స్కిన్ స్పెషలిస్టులు కూడా ఇదే మాట చెబుతారు, మన పెద్దలు ఇదే చెబుతారు, ఇక కుంకుడు రసంతో స్నానం చేస్తే జుట్టు పెరుగుతుంది చుండ్రు కురుపుల సమస్య తగ్గుతుంది.
అయితే కుంకుడు కాయపై పెంకు తీసివేయాలి, అంతేకాదు ఓ కప్పు కుంకుళ్లు రాత్రి వేడినీటిలో నానబెట్టండి, దీని వల్ల రసం ఎక్కువగా వస్తుంది, ఇక కుంకుళ్లు ఎప్పుడూ నానబెట్టిన తర్వాత రసం తీసే సమయంలో వడగట్టాలి, ఇక తల కురులు అంతా ఈ రసం పట్టించాలి.
కుంకుడుకాయల రసం కంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే, వాటిలో ఉండే ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్ వలన కళ్ళు మండుతాయి. ఎలర్జీ కూడా రావచ్చు. ఇక ఒకసారి కుంకుడు కాయలు నానబెట్టి ఆ రసం వారం రోజులు వాడతారు కొందరు ,ఇది డేంజర్ కేవలం 24 గంటల తర్వాత అవి వాడద్దు పని చేయదు ఆ రసం, దీని వల్ల అలర్జీలు కూడా వస్తాయి, స్కిన్ ఎర్రగా మారి దురద వస్తే మాత్రం మీకు కుంకుడు కాయలు పడనట్టు.. అలాంటివి కనిపిస్తే మీరు వాడకపోవడం మేలు.