తాజాగా జరిగిన ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది, అవును ఈ మిస్టరీ వీడాలి అని అందరూ ఎదురుచూస్తున్నారు, 2020లో ఇప్పటి వరకూ ఇదే మిస్టరగా ఉంది.
అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించిన ఓ లోహపు దిమ్మె గుర్తు ఉంది కదా అసలు ఇది ఎడారిలోకి ఎలా వచ్చింది.
ఎవరూ పెట్టి ఉంటారు , ఇది ఎలా ఇక్కడ ప్రత్యక్షమైంది అంటే ఎవరికి అర్దం కావడం లేదు.. అయితే ఇది మళ్లీ అక్కడ మాయం అయింది, ఇప్పుడు తాజాగా రొమేనియా దేశంలో ప్రత్యక్షం కావడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.
రొమేనియాలోని చారిత్రక పెట్రోడోవా డేసియన్ కోట సమీపంలో ఈ ముక్కోణాకారపు దిమ్మె దర్శనమిచ్చింది. అయితే కొందరు సైంటిస్టులు మాత్రం ఎవరైనా తయారు చేసి దీనిని ఇక్కడ హైప్ కోసం తీసుకువస్తున్నారా లేదా గ్రహంతర వాసుల పనా అనేది తెలుసుకుంటున్నారు, కాని ఆ దిమ్మకి ఈ దిమ్మకి కొన్ని తేడాలు ఉన్నాయి.. ఎడారిలో లోహపు దిమ్మపై ఎలాంటి పేర్లు రాతలు లేవు.. కాని ఇక్కడ రొమేనియాలో దిమ్మపై రాతలు ఉన్నాయి. మరి ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో.