టాలీవుడ్ నటుడు నాగబాబు కూతురు నిహారిక-చైతన్య జొన్నలగడ్డ వివాహం నిన్న అంగరంగ వైభంగా జరిగింది, ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు వచ్చారు, ఇక మెగా హీరోలు అల్లు హీరోలు సందడి చేశారు, ఇక రాజస్థాన్ ఉదయ్పూర్ ప్యాలెస్లో మూడు రోజుల పాటు మెగా ఫ్యామిలీ సందడి చేసింది, అయితే దాదాపు నిహారికకు అందరూ ఖరీదైన గిఫ్ట్ లు అందచేశారు.
ఇక చిరంజీవి కోట్ల రూపాయల విలువైన డైమెండ్ నెక్లెస్ ఇచ్చారు అని వార్తలు వచ్చాయి, అయితే ఇటు పవన్ కల్యాణ్ , రామ్ చరణ్ , బన్నీ, ఇటు అల్లు అరవింద్ , సాయిధరమ్ తేజ్ కూడా ఖరీదైన కానుకలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి…మొత్తానికి నిహారిక కొణిదెల తన పెండ్లి కానుకగా రూ.5 కోట్లకు పైగా విలువైన బహుమతులు అందుకుందని టాలీవుడ్ టాక్.
రేపు హైదరాబాద్ లో జరగబోయే పార్టీకి టాలీవుడ్ పెద్దలు హీరోలు హీరోయిన్లు సినిమా పరిశ్రమకు చెందిన వారితో పాటు పారిశ్రామిక రాజకీయ వేత్తలు కూడా రానున్నారు, పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ ఫంక్షన్ కు హజరు కానున్నారు. మొత్తానికి మెగా వారి ఇంట్లో మరో మూడు రోజులు ఈ సంబురాలు జరుగునున్నాయి.