జ‌న‌వ‌రి నుంచి రైల్వే ప్ర‌యాణికుల‌కి గుడ్ న్యూస్

-

క‌రోనాతో రైలు స‌ర్వీసులు కొన్ని నెల‌లు నిలిచిపోయాయి.. ఇప్పుడు కొన్ని స‌ర్వీసులు మాత్ర‌‌మే ప‌ట్టాలెక్కాయి.. ఇక సంక్రాంతి స‌మ‌యంలో కొన్ని రైళ్లు న‌డుపుతుంది రైల్వే శాఖ.. అయితే తాజాగా ఓ గుడ్ న్యూస్ తెలిపింది ప్ర‌యాణికుల‌కి.

- Advertisement -

క‌రోనా స‌మ‌యంలో ప్యాసింజర్ల భద్రతను పరిగణలోకి తీసుకొని ఇండియన్ రైల్వేస్.. ఏసీ కోచ్‌లలో బ్లాంకెట్స్ క‌ర్టెన్ల ను కూడా తొలగించింది… ఈ స‌మ‌యంలో బ్లాంకెట్లను ప్ర‌యాణికులు తెచ్చుకున్నారు.
తాజాగా కొత్త ఏడాది నుంచి ఇండియన్ రైల్వేస్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది.

తాజాగా ప్ర‌యాణికుల‌కి డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్ అందించాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది… ఓప‌క్క చ‌లి దారుణంగా పెరుగుతోంది, దీంతో ప్ర‌యాణికుల‌కి ఈ సౌల‌భ్యం ఇవ్వ‌నుంది.
డిస్పోజబుల్ ట్రావెల్ కిట్ ధర రూ.275గా ఉంది. ఈ న‌గ‌దు అద‌నంగా ఇవ్వాలి. మ‌రి ఏమి అద‌నంగా ఇస్తారు అంటే…ఒక బ్లాంకెట్, రెండు బెడ్ షీట్స్, ఒక తలదిండు, ఒక హెడ్ కవర్, ఒక జత చేతి గ్లౌజ్‌లు, మాస్క్, పేపర్ సోప్, హ్యాండ్ శానిటైజర్, పేపర్ నాప్కిన్ అంద‌చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...