కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా దూసుకుపోతోంది, చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. చిత్ర సీమలోకి 2016లో కిర్రాక్ పార్టీ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వెండితెరపై వెనుతిరిగి చూడలేదు…తెలుగు తమిళ కన్నడ సినిమాలతో బిజీగా మారింది.. అంతేకాదు బాలీవుడ్ లో కూడా ఆమెకి క్రేజ్ పెరిగింది.
ఛలోతో రష్మిక టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది, తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమాలో నటించింది..
ఈ విజయంతో రష్మికకు వరుస ఆఫర్లు వచ్చాయి…కార్తీ సరసన సుల్తాన్ ద్వారా రష్మిక కోలీవుడ్ ఎంట్రీ జరగనుంది. ఇక బీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో గత ఏడాది రెండు విజయాలు తనఖాతాలో వేసుకుంది.
ఈ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. తాజాగా అమితాబ్ సినిమాలో ఆమెకి ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి బీ టౌన్ లో… అయితే ఆమెకి రెమ్యునరేషన్ దాదాపు 5 కోట్ల వరకూ ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది. ఈ అమౌంట్ కు నిర్మాతల కూడా ఒకే చెప్పారు అని వార్తలు వినిపిస్తున్నాయి.