ఏపీలో గర్భిణులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తప్పక తెలుసుకోండి

-

ఏపీలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోంది జగన్ సర్కారు.. తాజాగా ఏపీలో గర్భిణులకు శుభవార్త చెబుతున్నారు, గర్భిణీలు ప్రతీ నెలా ఆస్పత్రులకి టెస్టులకి వెళతారు అనేది తెలిసిందే.. అయితే ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యసేవల కోసం వెళ్లేందుకు ఇకపై ఆటో, బస్సు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇంటి దగ్గరకే వాహనాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తోంది సర్కారు. ఇది నిజంగా దేశంలో మరో కొత్త పథకం అనే చెప్పాలి, ఇక వైద్య పరీక్షల కోసం వెళ్లే వారికి గర్భిణీలకు ఉచిత రవాణా ఏర్పాట్లు చేస్తోంది, 108,104, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్కు తోడు ఈ వాహనాలు రాబోతున్నాయి. ఇక గర్భిణీ ఎప్పుడు టెస్టులకి వెళ్లాలి అనేది డేటా ఉంటుంది కాబట్టి
వారికి ఆరోజు బండి అందుబాటులో ఉంచుతారు.

ఆశా వర్కర్కు, ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్కు ఫోన్చేసి వాహనాన్ని ఇంటివద్దకే రప్పించి ఆస్పత్రికి పంపిస్తారు. ఇక ఆమె పరీక్షలు చేయించుకునేంత వరకూ వాహనం అక్కడే ఉంటుంది, తర్వాత ఇంటి దగ్గర దించుతారు.. ముందు 5 జిల్లాల్లో 170 వాహనాల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు… ఇక తర్వాత అన్నీ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు… ఇది నిజంగా మంచి పథకం గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

లైంగిక స్టామినా పెరగాలంటే పురుషులు ఇవి మానుకోవాల్సిందే..!

ప్రస్తుత యువతరంలో లైంగిక సమస్యలు(Sex Stamina) అధికంగా ఉంటున్నాయి. అందుకు వారి...

జగన్‌ను తిరుమల వెళ్లొద్దని ఎవరన్నారు: చంద్రబాబు

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు...